సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్

11

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా , లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. రోహిన్ రెడ్డి మరియు బి. ఆర్. బుగ్గినేని నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందం గా ఉంది అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు.

ఈ చిత్రం ఆడియో ను జులై 30 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. “ఈ చిత్రానికి థమన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ధనుష్, శింబు వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రం లో రెండు పాటలను పాడటం ఈ ఆల్బం హైలైట్”, అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY