సందీప్‌ కిష‌న్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ కోసం పాట పాడిన తమన్

29

సాధారణం గా ఇద్దరు లీడింగ్ మ్యూజిక్ డిరెక్టర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ పోటీ కంటే ఫ్రెండ్షిప్ గొప్పది అని నిరూపిస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన స్నేహితుడు మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం లో ఒక పాట పాడారు.

‘ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌కిష‌న్‌ హీరో గా నటించిన ఈ చిత్రం లో , హీరో ఇంట్రడక్షన్ పాటను తమన్ ఆలపించారు. ఈ పాట రికార్డింగ్ పూర్తయ్యింది. “ఈ చిత్రం లో హీరో ఇంట్రడక్షన్ పాట తమన్ పాడితే బాగుంటుంది అనుకుని తనని అడిగాను. తను వెంటనే ఎంతో స్పోర్టివ్ గా ఒప్పుకున్నాడు. అందుకు తమన్ కి థాంక్స్ చెప్తున్నాను”, అని మిక్కీ అన్నారు. ఈ చిత్రం లో ని పాటలను శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ రచించారు.

విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది . మరొక రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది అని డైరెక్టర్ రాజ‌సింహ తాడినాడ తెలిపారు. “ఇది ఒక డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. అని ఆయన అన్నారు. రాజ‌సింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయన గతం లో ఎన్నో చిత్రాలకు రచయిత గా పని చేసారు.

మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. అయన గతం లో ‘సినిమా చూపిస్త‌మావ’ చిత్రానికి నిర్మాత గా ఉన్నారు. ఈ చిత్రం లో ప్రఖ్యాత హిందీ నటుడు రవి కిషెన్ విలన్ గా కనపడతాడు.

నటీ నటులు – సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రావు రమేష్‌, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులు.

సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

NO COMMENTS

LEAVE A REPLY