నేచుర‌ల్ స్టార్ నాని, దిల్‌రాజు, శ్రీరామ్ వేణు కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం `ఎంసిఎ` ప్రారంభం

12

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని హీరో, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `ఎంసిఎ` లాంచ‌నంగా ఈరోజు ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి వంశీ పైడిప‌ల్లి క్లాప్ కొట్ట‌గా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…
శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో నాని హీరోగా ఈ ఏడాది `నేను లోక‌ల్‌` సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌డూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి పున‌రావృత్తం అవుతుంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `ఎంసిఎ` చిత్రం మా బ్యాన‌ర్‌లో మ‌రో హిట్ చిత్రంగా నిలుస్తుంది. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోనఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు. సినిమా ప్రారంభ‌మైన ఈరోజు నుండే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాం. ఈ షెడ్యూల్‌ను నాని, ఆమ‌ని, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రుల‌పై కొన్నికీల‌క‌ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తో స్టార్ట్ చేశాం. `నేను లోక‌ల్‌`తో మా బ్యాన‌ర్‌లోనే నాని డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు నానికి వ‌రుస విజ‌యాల‌కు ఈ చిత్రం మ‌రో మెట్టుకానుంది.నేను లోక‌ల్ చిత్రానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. మ‌ల‌యాళ `ప్రేమ‌మ్‌`లో న‌టించిన సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచే చిత్ర‌మ‌వుతుంది భావిస్తున్నాను“ అన్నారు.

నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః దివాక‌ర్ మ‌ణి, నిర్మాణంః శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.

NO COMMENTS

LEAVE A REPLY